భువనగిరి గెలుపు సోనియాగాంధీకి అంకితం : కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

-

భువనగిరి పార్లమెంట్ గడ్డపై కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని, ఈ గెలుపు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అంకితమని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరిలోని పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. భువనగిరి గడ్డ కాంగ్రెస్ అడ్డ అని పార్లమెంట్ ప్రజలు నిరూపించారని, భువనగిరి పార్లమెంటులో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించిన భువనగిరి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

భువనగిరి అడ్డ మీద మరో సారి కాంగ్రెస్ గెలుపు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ భూమి ఆకాశం ఉన్నత కాలం తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని తెలంగాణ ప్రజలు మరువరని చెప్పారు. భువనగిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి సోనియాగాంధీ రుణం తీర్చుకున్నట్లు వెల్లడించారు. భువనగిరి ఎంపీ గెలుపుకు కృషి చేసిన నాయకులకు అందరికీ తన తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. తన మీద నమ్మకంతో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల బాధ్యత అప్పగించిన అధిష్టానం నమ్మకాన్ని భువనగిరి ప్రజలు నిలబెట్టినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news