ఉత్కంఠ రేపుతున్న మహబూబ్ నగర్ ఎంపీ ఫలితం..!

-

దేశవ్యాప్తంగా ఇవాళ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా చాలా ఉత్కంఠగా మారిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం సాధించింది. అలాగే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఫలితం చాలా ఉత్కంఠ రేకేత్తించింది. అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. తాజాగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి ఫలితం చాలా ఉత్కంఠగా మారింది.

తొలుత బీజేపీ అభ్యర్థి డీ.కే.అరుణ ముందంజలో కొనసాగారు. ఆ తరువాత కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ముందంజలో కొనసాగారు. ముఖ్యంగా కోడంగల్, జడ్చర్ల, షాద్ నగర్ అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగింది. మిగతా స్థానాల్లో బీజేపీ హవా కొనసాగింది. తాజాగా 7వేల ఓట్ల ఆధిక్యంలో డీ.కే.అరుణ కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి 7,510 ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు లెక్కించిన తరువాత తుది ఫలితం వెలువడనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీ.కే.అరుణ విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news