రాహుల్ గాంధీ సభ తర్వాత బిజెపికి భయం పట్టుకుంది: మధుయాష్కిగౌడ్

-

రాహుల్ గాంధీ సభ తర్వాత బిజెపి కి భయం పట్టుకుంది అన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. రైతు డిక్లరేషన్ ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని రాహుల్ గాంధీ అన్నారని చెప్పారు. రైతు డిక్లరేషన్ లోని 9 పథకాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుందన్నారు మధుయాష్కి. రాహుల్ గాంధీ సభ ప్రతి రైతు కుటుంబాన్ని తట్టిలేపింది అన్నారు. కల్వకుంట్ల కుటుంబం అంటే ఊసరవెల్లిలా రంగులు మార్చే కుటుంబం అన్నారు. కెసిఆర్ అంటే మోసం దగా అంటూ విమర్శించారు.

కాంగ్రెస్ రైతాంగాన్ని కాపాడడానికి రైతు డిక్లరేషన్ ని తీసుకుంది అన్నారు.నిరుద్యోగులు, ఆదివాసీలు, మైనారిటీ లని ఏకం చేస్తూ మరో బహిరంగ సభ ఉంటుందన్నారు. సోనియాగాంధీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు మధుయాష్కి. రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగే ఎమ్మెల్యే లకి బంగ్లాలు వజ్రవైఢూర్యాలు ఎట్లా వచ్చాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news