బండి సంజయ్ నాయకత్వంలోనే రాష్ట్రంలో బీజేపీ ఈ స్థాయికి చేరింది – జితేందర్ రెడ్డి

-

హైదరాబాద్: నేడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో బిజెపి నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం తెలంగాణ బిజెపిలో ఏర్పడ్డ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇక సమావేశం అనంతరం జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో పరిణామాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిపారు జితేందర్ రెడ్డి. బండి సంజయ్ నాయకత్వంలోనే రాష్ట్రంలో బిజెపి ఈ స్థాయికి చేరిందని.. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు.

పార్టీ విషయాలను బయటకు లీక్ కాకుండా చూడాలని నిర్ణయించుకున్నామన్నారు. పార్టీలో పరిణామాలపై అధిష్టానానికి లేఖ రాసే యోచనలో ఉన్నట్లు తెలిపారు జితేందర్ రెడ్డి. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఖాయం అన్నారు. బిఆర్ఎస్ ని ఢీకొట్టే దమ్ము బిజెపి కి మాత్రమే ఉందన్నారు. పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదన్న జితేందర్ రెడ్డి.. పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఢిల్లీలోనే జరుగుతుందన్నారు. పార్టీ అధ్యక్ష మార్పు అంటూ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news