కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ లో పార్టీలో మరో ఎమ్మెల్యే చేరిపోయారు. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్కు మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/06/Blow-To-KCRs-Party-As-Another-MLA-Dr-M.-Sanjay-Kumar-Joins-Ruling-Congress-In-Telangana.webp)
జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పోచారం చేరిక షాక్ నుంచి తెరుకోక ముందే సంజయ్ మరో షాక్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సంజయ్ కూడా హస్తం గూటికి చేరడం సంచలనంగా మారింది.