మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే : డీకే శివకుమార్

-

కేసీఆర్ ఎందుకు రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేశాడా అని ప్రశ్నించారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలను ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేస్తున్నాం.. తెలంగాణలో కూడా అధికారంలోకి రాగానే తప్పకుండా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ పేర్కొన్నారు. రైతుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది.

పార్లమెంట్ లో ప్రతీ బిల్లుకు బీఆర్ఎస్.. బీజేపీకి మద్దతు ఇస్తుందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా.. ఎవ్వరైనా వచ్చి చెక్ చేసుకోండి. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ గద్దె దించి.. కాంగ్రెస్ కి పట్టం కట్టబోతున్నారు ప్రజలు. కర్నాటకలో 5 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణ బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కోసం ఓటు వేసేందుకు సిద్ధం అయ్యారు. కాంగ్రెస్ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు డీ.కే.శివకుమార్.

Read more RELATED
Recommended to you

Latest news