హైదరాబాద్​లో మరో విషాదం.. నీటిగుంటలో పడి బాలుడు మృతి

-

హైదరాబాద్​లో జీహెచ్​ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నాలాలో పడి ఇటీవలే ఓ బాలిక మృతి చెందిన ఘటన మరవకముందే మరో బాలుడు నీటి గుంటలో పడి చనిపోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో చోటుచేసుకుంది.

death

జూబ్లీహిల్స్​లోని రోడ్ నెంబర్ 45లో ఓ ఖాళీ స్థలంలో వివేక్ అనే ఏడేళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో వివేక్ ప్రమాదవశాత్తు అక్కడున్న నీటి గుంటలో పడిపోయాడు. గమనించిన స్నేహితులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులతో పాటు ఘటనాస్థలికి చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు.. అతడి మృతదేహాన్ని నీటి గుంత నుంచి బయటకు తీశారు.

‘వివేక్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాకినాడ నుంచి జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. మృతుని తండ్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఓ బైక్ షోరూంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వేసవి సెలవులు కావడంతో మృతుడు వివేక్ బయటకు వెళ్లి ఆడుకుంటూ నీటి గుంతలో పడిపోయి చనిపోయాడని’ పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news