బ్రేకింగ్:తెలంగాణాలో కరోనా విలయం…!

-

తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మొన్న రెండు రోజులు తగ్గిన కరోనా కేసులు నేడు మళ్ళీ పెరిగాయి. రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 2 వేల 92 మంది కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో 1289 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం 52 వేల 103 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు కూడా పెరుగుతుంది.

coronavirus
coronavirus

71.3 శాతంగా ఉంది రికవరీ రేటు. ఇక యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 20 వేల 350 గా ఉన్నాయి. ఇప్పటి వరకు 5 లక్షల 43 వేల మందికి కరోనా పరిక్షలు చేసారు. నిన్న ఒక్క రోజే 21 వేల మందికి కరోనా పరిక్షలు నిర్వహించారు. తెలంగాణాలో నిన్న ఒక్క రోజే 13 మంది మరణించగా కరోనా బారిన పడి ఇప్పటి వరకు 589 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news