బ్రేకింగ్: తెలంగాణాలో కరోనా కొత్త రికార్డ్…!

-

తెలంగాణాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోన కట్టడి విషయంలో ఎంత సమర్ధవంతంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా అంత సీన్ మాత్రం కనపడటం లేదు. గత 24 గంటల్లో 2 వేల 257 మందికి కరోనా సోకింది. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 22 వేల 568 గా ఉన్నాయి అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

coronavirus
coronavirus

మరణాలు 615 గా ఉన్నాయి రాష్ట్రంలో. మొత్తం కేసులు 77 వేల 513 కి చేరుకున్నాయి. కోలుకున్న వారి సంఖ్య 54 వేల 300 గా ఉంది. కరోనా కేసులు మొదలైన తర్వాత ఒక్క రోజే ఈ రేంజ్ లో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరణాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇక టెస్ట్ లు కూడా రాష్ట్రంలో భారీగానే చేస్తున్నారు. హైదరాబాద్ లోనే 464 మంది కరోనా బారిన పడగా రంగారెడ్డి లో 180 మందికి కరోన సోకింది.

Read more RELATED
Recommended to you

Latest news