BREAKING: బిజెపిలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

-

టిఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బిజెపిలో చేరారు. కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్, బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో బిజెపిలో చేరారు బూర నర్సయ్య గౌడ్. ఆయనకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తరుణ్ చుగ్. అలాగే కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ చేతుల మీదుగా బిజెపి పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారు.

బూర నర్సయ్యతో పాటు కాంగ్రెస్ నేత వడ్డేపల్లి నర్సింగరావు కుమారుడు కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన వడ్డేపల్లి రాజేశ్వరరావు, పిసిసి సెక్రెటరీ వెంకటేష్, టిడిపి నేత రవి ప్రకాష్ యాదవ్ తో పాటు పలువురు నేతలు బిజెపి కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.

https://twitter.com/ANI/status/1582644690788450305?t=f6l7g1bsGfp8370gseKtVA&s=08

Read more RELATED
Recommended to you

Latest news