బ్రేకింగ్:తెలంగాణాలో భారీగా కరోనా కేసులు…!

-

తెలంగాణ లో కొత్తగా 2012 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా భారిన పడి 13 మంది మృతి చెందారు. 70958 కి కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. 576 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లో కొత్తగా 532 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 198 కేసులు నమోదు కాగా… రంగారెడ్డి జిల్లాలో 188 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

coronavirus
coronavirus

కరోనా రెండు మూడు రోజుల నుంచి తగ్గినా సరే వేగంగా కేసులు పెరుగుతున్నాయి మళ్ళీ. తెలంగాణాలో గత 24 గంటల్లో 21 వేలకు పైగా కరోనా పరిక్షలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 5 లక్షల 22 వేల మందికి కరోనా పరిక్షలు చేసారు. తెలంగాణాలో కరోనా రికవరీ రేటు 71 శాతంగా ఉంది. యాక్టీవ్ కేసులు 19 వేల 568గా ఉన్నాయి. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని 50 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news