BREAKING: వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు హైకోర్టులో ఊరట లభించింది. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు హైకోర్టులో అనుమతి లభించింది. సోమవారం నర్సంపేటలో షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. ఆమె పాదయాత్ర వాహనానికి టిఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టడంతో పాదయాత్రలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే.

దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ కి తరలించారు. ఈ నేపథ్యంలో ఆమె పాదయాత్ర అర్ధాంతరంగా ఆగిపోయింది. దీనిపై ఆమె హైకోర్టుకు వెళ్ళగా పాదయాత్రకు అనుమతి లభించింది. ఇక ప్రస్తుతం వైఎస్ షర్మిల ప్రగతి భవన్ కి వెళ్ళేందుకు ప్రయత్నించగా ఆమెను అరెస్టు చేసి పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news