జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి.. కేసీఆర్, రేవంత్ దిగ్భ్రాంతి

-

తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జిట్టా బాలకృష్ణారెడ్డి ఇవాళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని తెలిపారు.

 

తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన పోరాటంలో జిట్టా బాలకృష్ణారెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారని వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. వారి మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అటు మిత్రుడు, సన్నిహితుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు సీఎం రేవంత్. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రపోషించి తన కంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు సీఎం రేవంత్.

Read more RELATED
Recommended to you

Latest news