పొంగులేటి అనుచరులపై BRS బహిష్కరణ వేటు

-

గత కొంతకాలంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ బీఆర్ఎస్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్న విషయం తెలిసిందే. బహిరంగంగానే పార్టీపై, ప్రభుత్వం విమర్శలు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. చాలా రోజులుగా పొంగులేటి బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో స్పందించని బీఆర్ఎస్ పార్టీ.. తాజాగా చర్యలకు పూనుకుంది.

తాజాగా వైరా నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ​ నాయకులు, ప్రజాప్రతినిధులు పొంగులేటిని కలవడానికి వెళ్లారు. ఈ విషయం అధిష్ఠానానికి తెలియడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్రమశిక్షణ చర్యలకు పూనుకుంది. వైరా నియోజకవర్గంలో 20మంది నాయకులపై బీఆర్​ఎస్​ చర్యలు తీసుకుంది. రాష్ట్ర మార్క్​ఫెడ్​ వైస్​ ఛైర్మన్​ బొర్రా రాజశేఖర్​ను బీఆర్​ఎస్​ నుంచి బహిష్కరించింది. వైరా పురపాలక ఛైర్మన్​ జైపాల్​తో పాటు 18 మందిని సస్పెండ్​ చేసింది. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆయా మండల పార్టీ అధ్యక్షులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news