జగన్‌ సర్కార్‌ కు ఉద్యోగుల హెచ్చరికలు..ఈనెల 26 లోపు సమస్యలు పరిష్కరించాల్సిందే !

-

జగన్‌ సర్కార్‌ కు ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 26 లోపు సమస్యలు పరిష్కరించాల్సిందేని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

ఈ మేరకు కర్నూలులో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అంతలోపు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తామని తెలిపారు. ఇక, ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర మహాసభ విజయవంతమైందని బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ జేఏసీ 94 సంఘాల నుంచి 100 సంఘాలకు పెరిగిందని, ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగుల మహాసభ ఎప్పుడు జరగలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news