ఇవాళ మహారాష్ట్ర పర్యటనకు బిఆర్ఎస్ మంత్రులు

-

మహారాష్ట్ర పర్యటనకు బిఆర్ఎస్ మంత్రులు వెళ్తున్నారు. బుధవారం అంటే ఇవాల్టి రోజున మహారాష్ట్రలోని సోలాపూర్ లో పర్యటించనున్నారు. పద్మశాలిలు ఘనంగా నిర్వహించే మార్కండేయ రథోత్సవానికి ఆహ్వానం అందడంతో వెళ్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హరీష్ రావు, మహమూద్ ఆలీ, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్ చార్జీ కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు రథోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం పార్టీ నాయకులతో భేటీ అయి పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. కాగా, గత నెలలో రెండు రోజుల పాటు సిఎం కేసీఆర్ కూడా మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news