ASIA CUP: ఇవాల్టి నుంచే ఆసియా కప్….టీమిండియా ఏడుసార్లు విజేతగా..

-

నేటి నుంచే ఆసియా కప్‌ పోరు ప్రారంభం కానుంది. టీమిండియా ప్లేయర్లు ఆసియాకప్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. గత ఆరు రోజులుగా బెంగళూరు శివారులోని ఆలూర్ క్యాంప్ లో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లలో 17 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. శిక్షణ శిబిరం నిన్నటితోనే ముగిసింది.

ఇక ఇవాళ భారత జట్టు.. శ్రీలంక కు బయలుదేరనుంది. అయితే, నేటి నుంచి ఆసియా కప్ స్టార్ట్ అవుతుండగా… భారత్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ఇప్పటివరకు 15 సార్లు ఆసియా కప్ జరగగా… అందులో ఏడుసార్లు ఇండియా విజేతగా నిలిచింది. 1984, 1988, 1990-91, 1995, 2010, 2016తో పాటు చివరిసారిగా భారత్ 2018 లో టైటిల్ గెలిచింది. ఇక ఇప్పటివరకు టోర్నీలో 49 మ్యాచులు ఆడిన టీమ్ ఇండియా 31 మ్యాచుల్లో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news