బండి సంజయ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన.. కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మూడు గంటల నుంచి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు దిల్లీ చేరుకున్నారు. మరోవైపు రాష్ట్రంలోనూ కార్యకర్తలు కవితకు మద్దతు తెలుపుతున్నారు.

హైదరాబాద్ నగరంలో కవితకు మద్దతుగా.. పలుచోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు పలు చోట్ల దిష్టి బొమ్మలు దహనం చేశారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో ఆందోళనకు దిగారు. వెంటనే సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని.. కవితకు క్షమాపణ చెప్పాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. దిల్లీలో కవిత విచారణ, నగరంలో బీఆర్ఎస్ ఆందోళనల దృష్ట్యా నగరంలోని బషీర్‌బాగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయానికి తాళాలు వేసి.. పోలీసులు భారీగా మోహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news