రేవంత్ రెడ్డి చెప్పులపై బీఆర్ఎస్ ట్రోల్.. కవిత సంగతేంటంటూ కాంగ్రెస్ కౌంటర్..!

-

రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను రేవంత్ రెడ్డి ఎత్తిచూపుతుంటే వాటికి కౌంటర్ ఇయ్యబోయి బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు సెల్ఫ్ గోలుగా మారుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పులపై బీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభించగా విమర్శల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుచ్చి బ్రాండ్ చెప్పులు ధరించిన రేవంత్ రెడ్డి ఫోటోను షేర్ చేస్తూ.. 50వేల ఖరీదైన చెప్పులు వేసుకున్న రైతు బిడ్డ అని బీఆర్ఎస్ అనుచరులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ధరించిన చెప్పులకు కేసీఆర్ ధరించిన చెప్పులతో కంపారిజన్ చేస్తూ దొరపాలన చేసిన కేసీఆర్ 400 చెప్పులు ధరిస్తే ప్రజాపాలన చేసేవాడు 50,000 చెప్పులు ధరిస్తున్నాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఖరీదైన చెప్పులు ధరించే నాయకుడికి నిరుపేదల సమస్యలు ఏం తెలుస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు. టిఆర్ఎస్ చేస్తున్న ట్రోల్స్ పై నేటిజన్స్ కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో గులాబీ పార్టీ మద్దతులకు కౌంటర్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు చివరకు ఖరీదైన చెప్పులు ధరించిన కూడా ఏడ్చే స్థాయికి దిగజారారా అంటూ మండిపడుతున్నారు. రైతు బిడ్డ రేవంత్ రెడ్డి 50 వేల చెప్పులు ధరించవద్దు సరే సో కాల్డ్ రైతుబిడ్డ కవిత మాత్రం రూ.20 లక్షల వాచ్ పెట్టవచ్చా..? అని నిలదీస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news