29 న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం

-

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 29న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు మారెడ్డి రవీందర్ రెడ్డి, కడవేర్లు రాజనర్సు, పాల సాయిరాం తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు సుపరిచితుడు, ఉన్నత విద్యావంతుడైన వెంకట్రాంరెడ్డి కి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

గతంలో మాదిరిగానే మెదక్ పార్లమెంట్ స్థానంపై ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వందరోజుల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన పై ప్రజల్లో చర్చ మొదలైంది అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఆరోపణతోనే కాలం వెళ్లదీస్తుందని ఎద్దేవ చేశారు. విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ అభ్యర్థి పరిచయ కార్యక్రమంతో పాటుగా, ఎమ్మెల్యే హరీష్ రావు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news