రేవంత్ కుంభకోణాల ఆధారాలను ప్రజల ముందు ఉంచుతాం : కేటీఆర్

-

రేవంత్ రెడ్డి చేస్తున్న అనేక కుంభకోణాలకు సంబంధించిన వివరాలను ప్రజల ముందు వరుసగా ఉంచుతాం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఫోర్ బ్రదర్స్ సిటీ వంటి కుంభకోణాలను ప్రజల ముందు ఉచితం. బావమరిదికి అమృతం పంచుతూ తెలంగాణ ప్రజలకు విషాన్ని పంచుతున్న రేవంత్ రెడ్డిని ప్రజల ముందు ఎండగడతాం. బావమరిది కంపెనీకి 1100 కోట్ల పనులు ఇచ్చి జీవోలు ఎందుకు వెబ్సైట్లో పెట్టడం లేదు రేవంత్ రెడ్డి చెప్పాలి.రెండు కోట్ల కంపెనీకి వెయ్యి కోట్లు టెండర్ అప్పజెప్పి ఈ విషయాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి దాస్తున్నారో చెప్పాలి.

ఇందులో ముఖ్య మంత్రి ఒత్తిడి మేరకే ఈ టెండర్ల గోల్మాల్ జరిగింది. ఈ రాష్ట్రంలో బయటకు సమాచారం రాని అక్రమాలు ఎన్నో ఉన్నాయి. అమృత్ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. అందుకే ఈ టెండర్లు జరిగిన అభివృద్ధి అక్రమాల పైన నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు లేఖ రాశాము. ఈ టెండర్లలో జరిగిన అక్రమాలను తేల్చాలని కోరాము అన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version