కోమటిరెడ్డి రాజ్ గోపాల్ హోంగార్డు కూడా కాలేడు.. బీజేపీ ఎంపీ అభ్యర్థి

-

ahre onగురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బూర నర్సయ్య మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోంగార్డు కూడా కాలేడని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ ఏజెంట్ అని ఆరోపించారు. అందుకే చామలను ఎంపీ అభ్యర్థిగా పెట్టారని చెప్పారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేందుకు చామల కిరణ్ సొంత ఎమ్మెల్యేలనే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరో కూడా ప్రజలకు తెలియదని ఎద్దేవా చేశారు.

గల్లీలో.. ఢిల్లీలో లేని బీఆర్ఎస్ కి ఓటు వేసి ఉపయోగం లేదన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా అభివృద్ది చెందుతుందన్నారు. మోడీ లాంటి నాయకులు దేశాన్ని నడిపించడం మన అదృష్టం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news