అక్కడి నుంచి పోటీ చేస్తే చిరంజీవి సీఎం కావడం పక్కా.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని కీలక వ్యాఖ్యలు చేసారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు, లోక్ సభ ఎన్నికల్లో 20 సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పారు. కాపులకు ఇదే మంచి అవకాశం అని సూచించారు. మరోసారి తిరుపతి నుంచి పోటీ చేస్తే.. సీఎం కావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేసారు. 

చిరంజీవి పోటీకి దిగితే.. 50వేల పై చిలుకు మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు. రాజకీయాల్లో రీ ఎంట్రీపై, వచ్చే ఎన్నికల్లో పోటీ వెంటనే చిరంజీవి ఓ నిర్ణయం తీసుకుంటే ఏపీపై అధికారం చేజిక్కించుకోవడం సులభం అవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా అన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. సీపీఐ(ఎం), సీపీఐ నాయకులతో మాట్లాడామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news