నారాయణ్ దాస్ కె.నారంగ్ మృతి పట్ల చిరు, పవన్, మహేష్ సంతాపం

-

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణ్ దాస్ కె. నారంగ్ (78) అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.ఆయన మృతి పట్ల సినీ నటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సంతాపం తెలిపారు.

ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాటమీద నిలబడే నికార్సయిన మనిషి, అపార అనుభవజ్ఞుడు, సినీ రంగంలో ఒక మహారధి, ఫిలిం చాంబర్ ఆఫ్ ఫిలింకామర్స్ అధ్యక్షులు శ్రీ నారాయణ దాస్ నారంగ్ గారికి శ్రద్ధాంజలి అని చిరంజీవి ట్వీట్ చేశారు.

నారాయణ దాస్ నార్ంగ్ మృతి పట్ల చింతిస్తున్నాను అంటూ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన చేశారు.నారంగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను అని అన్నారు.తాను నటించిన సినిమాల్లో కొన్నింటిని ఆయన సంస్థ ద్వారా పంపిణీ చేశారని చెప్పారు.నారంగ్ కుమారుడు సునీల్ నారంగ్ , ఇతర కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.

నారాయణ దాస్ ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని మహేష్ బాబు ట్వీట్ చేశారు.టాలీవుడ్ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని, ఆయన కుటుంబ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. నారాయణ దాస్ తో కలిసి పనిచేసే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.వివి వినాయక్, సుధీర్ బాబు, సుశాంత్, శివ కార్తికేయన్, మెహెర్ రమేష్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా నారంగ్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news