హైదరాబాద్ వాసులకు శుభవార్త..నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ కు లైన్ క్లియర్

-

హైదరాబాద్ వాసులకు శుభవార్త..నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ కు లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్ నగరం లో జోవో 118 కు మోక్షం కలిగింది. దీంతో హైదరాబాద్ లోని నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ కు లైన్ క్లియర్ అయింది. మొత్తం ఆరు నియోజకవర్గాల్లో 15 వేల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు.

వెయ్యి గజాల్లోపు వారు గజానికి 250 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. దీని కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ నగర శివారు ప్రాంత వాసులు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. ఇక ఈరోజు ఎల్ బి నగర్ నియోజకవర్గంలో అర్హులకు పట్టాలు ఇవ్వనున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news