సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ

-

గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. ఆ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసిన ఆయన.. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలని విన్నవించారు.

గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఎం కేసీఆర్ ను భట్టి విక్రమార్క కోరారు. పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభమై 4 నెలలైనా పుస్తకాలు అందలేదని గుర్తుచేశారు. త్వరలో గురుకుల, ప్రభుత్వ హాస్టల్స్, జూనియర్ కళాశాలలు సందర్శించనున్నట్లు భట్టి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news