రేపు పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

-

కల్వకుంట్ల కవితకు ఈడి నోటీసులు జారీ చేయడంతో సీఎం కేసీఆర్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. రేపు సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. 10వ తేదీన అంటే రేపు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్‌లు, కార్పొరేషన్ చైర్మన్‌లు, డీసీఎంఎస్‌, డీసీసీబీ చైర్మన్‌లు పాల్గొననున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలపై విస్తృతంగా చర్చ జరుగనుంది. అలాగే కవిత విషయంపై కూడా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవాలని తెలుస్తోంది. అటు ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో… తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగునుంది. ఈ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం అందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news