గద్వాల కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

-

నేడు జోగులాంబ గద్వాల్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ పర్యటనలో భాగంగా గద్వాల సమీకృత కలెక్టరేట్ నీ ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ తర్వాత చాంబర్ లో కలెక్టర్ పల్లూరి క్రాంతిని కూర్చోబెట్టిన సీఎం కేసీఆర్.. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా రూ. 51,18 కోట్లతో మూడు అంతస్తులలో నిర్మించిన ఈ భవనంలో 36 జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేశారు.

అనంతరం ఎస్పీ కార్యాలయం, భారత రాష్ట్ర సమితి పార్టీ ఆఫీసుని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత గద్వాలలోని అయిజా రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గద్వాల్ పట్టణం మొత్తం గులాబీమయంగా మారింది. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ బిఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లతో నిండిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news