నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. రేపు బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

-

బిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో అత్యాధునిక హంగులతో వసంత్ విహార్ లో నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రేపు ప్రారంభించనున్నారు. బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన పూజలు చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మంగళవారం బిఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు.

కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించే యాగం, హోమం, ఇతర పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇకనుంచి జాతీయ స్థాయి పార్టీ కార్యకలాపాలు అన్నీ కేంద్ర కార్యాలయం నుండే నడవనున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా 200 మంది ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. రేపు పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని.. గురువారం ఆయన ఢిల్లీలో ఉంటారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news