రేపు కొల్లూర్​లో ‘డబుల్‌’ ఇళ్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

-

తెలంగాణ రాష్ట్ర సర్కార్ పేదవాళ్లు కూడా ఆత్మగౌరవంతో బతికేందుకు డబుల్ బెడ్​రూమ్ ఇళ్లు అనే పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే ఎంతో మందికి ఇళ్లను పంపిణీ చేశారు. తాజాగా సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలో డబుల్ బెడ్​రూమ్ టౌన్​షిప్​ను నిర్మించింది. కొల్లూర్‌ గ్రామంలో 145 ఎకరాల విస్తీర్ణంలో రూ.1432.5కోట్ల వ్యయంతో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్​రూం ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 117 బ్లాక్‌లు, అందులో జీ+9లో 38, జీ+10లో 24, జీ+11లో 55బ్లాక్‌లుగా నిర్మాణాలు చేపట్టారు. ఒక్కో డబుల్‌ బెడ్‌రూం విస్తీర్ణం 580 ఎస్‌ఎఫ్‌టీ వరకు ఉంటుంది. ప్రతి బ్లాక్‌కు 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లు, జనరేటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లోర్‌లో ఫైర్‌ సేఫ్టీని ఏర్పాటు చేశారు. 36 మీటర్లు, 30మీటర్ల ఔటర్‌ రోడ్లు, 8 మీటర్లు, 6 మీటర్ల ఇన్నర్‌ రోడ్లను వేశారు. 12అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ సంప్‌లను నిర్మించారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news