“మే” డే సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

-

“మే” డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మే’ డే సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు.

cm revanth reddy on may day

శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందని అన్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి తెలంగాణ పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ ముఖ్యమంత్రి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news