ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ పై చర్చించే అవకాశం..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. శనివారం ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం కాంగ్రెస్ పెద్దలతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు.

తాజాగా లోక్ సభ ఎన్నికలు ముగియడంతో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక తదితర విషయాలపై చర్చిస్తారని సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొననున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వంశీచంద్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరు కానున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవీ సీతక్క కే అనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. సీతక్కకా..? లేక మరెవ్వరికా అనేది త్వరలోనే తేలనుంది.

Read more RELATED
Recommended to you

Latest news