చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం, వేదిక ఖరారు

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీయే కూటమి ముఖ్యనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున.. ఎయిమ్స్ సమీపంలోని స్థలాన్ని అధికారులు, టీడీపీ నేతలు పరిశీలించారు.

కానీ ఆ ప్రాంతం అంత అనువుగా లేకపోవడంతో గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏర్పాట్లకు కావాల్సిన సామాగ్రిని కూడా సిద్ధం చేశారు అధికారులు. సభా వేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామాగ్రిని తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్, తదితరులు సభాస్థలాన్ని పరిశీలించారు. చంద్రబాబు తొలుత జూన్ 09న ప్రమాణం చేస్తారని ప్రకటించినప్పటికీ.. ప్రధాని మోడీ అదే రోజు ప్రమాణస్వీకారం చేస్తుండటంతో ఈనెల 12కి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news