కేసీఆర్ ను పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, BRS అధ్యక్షుడు కేసీఆర్ ను ఇవాళ రేవంత్‌ రెడ్డి కలువనున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, BRS అధ్యక్షుడు కేసీఆర్ కు హిప్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ విజయవంతమైందని, ఆయన కోరుకుంటున్నారని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

CM Revanth Reddy will visit KCR

ప్రస్తుతం వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్నారని మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, త్వరగా కోలుకోవడానికి అనుకూలంగా శరీరం సహకరిస్తోందన్నారు. మానసికంగా కూడా కేసీఆర్ దృఢంగా ఉన్నారని తెలిపారు. అయితే నేడు సీఎం రేవంత్ రెడ్డి యశోదకు వెళ్ళనున్నారు. కేసీఆర్ ను పరామర్శించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news