తుక్కుగూడలో కాంగ్రెస్ కెరటాలు పోటెత్తాయి : రేవంత్ రెడ్డి

-

హైదరాబాద్ తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభకు వచ్చిన స్పందనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. తుక్కుగూడలో కాంగ్రెస్ కెరటాలు పోటెత్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. సభకు తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్… ఓ మహా సముద్రం అందులో… మా కార్యకర్తలు… నీటి బిందువులు కాదు… పేదల బందువులు… మా కార్యకర్తలు… పోటెత్తె కెరటాలు… పోరాడే సైనికులు… మా కార్యకర్తలు… త్యాగశీలులు… తెగించి కొట్లాడే వీరులు మా కార్యకర్తలు… జెండా మోసే బోయీలు మాత్రమే కాదు… ఎజెండాలు నిర్ణయించే నాయకులు. నిన్నటి తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది… చేసిన శబ్ధమిది. అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ‘బీ’ టీం అయిన బీఆర్ఎస్ ను ఓడించామని.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించబోతున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news