నేడు ఖైరతాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలతో కేటీఆర్‌ సమావేశం

-

లోక్‌సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్‌ఎస్‌ పార్టీ వరుస సమావేశాలు, సభలతో ప్రచారంలో దూసుకెళ్తోంది. మరోవైపు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఆదివారం రోజున  తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ పాల్గొననున్నారు. ఆయనతో పాటు ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని నేతలంతా హాజరు కానున్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తారు. బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా బీఆర్ఎస్ వ్యూహాలను నేతలకు వివరించనున్నారు. ప్రజలంతాబీఆర్ఎస్ వైపే ఉన్నారంటున్న కేటీఆర్.. కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలని నాయకులకు మార్గనిర్దేశం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news