జూబ్లీ హిల్స్ లో సీఎం క్యాంప్ ఆఫీస్.. స్వయంగా పరిశీలించిన రేవంత్..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇకపై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రాంగణంలోకి రానున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రగతి భవన్ సీఎం క్యాంపు కార్యాలయంగా కొనసాగింది. దీనిని తాజాగా ప్రభుత్వం జ్యోతిబాపూలే ప్రజా భవన్ గా మార్చడంతో సీఎం క్యాంపు కార్యాలయం మరో చోటుకు షిప్ట్ కావాల్సి వచ్చింది. దీనికి అనుగుణంగా ఎంసీఆర్ హెచ్ఆర్ డీ ప్రాంగణంలో గట్టుమీద ఉన్న బ్లాక్ లోకి మార్చే ఆలోచనలు తెరమీదకు వచ్చాయి. 

 

స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భవనాన్ని ఆదివారం పరిశీలించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి పరిసరాల్లో ఉండటంతో క్యాంపు కార్యాలయంగా అక్కడికీ దగ్గరలోనే ఉన్న హెచ్ఆర్డీ ప్రాంగణంలోకి మారుతుంది. దాదాపు 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హెచ్.ఆర్.డీ ప్రాంగణంలో ఒకేసారి దాదాపు 150 మంది చొప్పున కూర్చునే నాలుగు కాన్ఫరెన్స్ హాళ్లు, పరిపాలక మండలి సమావేశం కావడానికి వీలుగా బోర్డు రూమ్.. 250 మంది కూర్చునే ఆడిటోరియం, అతిథులకు ఆశ్రయం ఇవ్వడానికి మంజీర, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడివిడి బ్లాకులున్నాయి. ఈ ప్రాంగణంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు అయితే రెగ్యులర్ గా జరిగే కాన్ఫరెన్స్ లు, లెక్చర్లు, ట్రైనింగ్ వంటి యాక్టివిటిస్ సెక్యురిటీ కారణాలతో ఇబ్బంది లేకుండా విడి ఎంట్రీగా గుట్టమీద ఎత్తుగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసే విధంగా ఆలోచనలు జరుగుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నది.  

Read more RELATED
Recommended to you

Latest news