వైఎస్ షర్మిల కీలక నిర్ణయం…ఇకపై

-

Congress chief YS Sharmila took a key decision: కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారానికి రెండు రోజుల పాటు విజయవాడలో ఉండాలని ఆమె యోచిస్తున్నారు. ఇక్కడ ఉంటూ పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నేతలతో చర్చించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు(శుక్రవారం), రేపు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో పార్టీ నేతలతో షర్మిల భేటీ కానున్నారు.

Congress chief YS Sharmila took a key decision

ఇక అటు మొన్న విశాఖలోని డక్కన్ క్రానికల్ కార్యాలయంపై తెదేపా కార్యకర్తల దాడి ఖండించదగిందని ఫైర్‌ అయ్యారు వైఎస్ షర్మిల. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేక, ఎదురు ఈ చర్యలా? మేలుకోకపోతే రేపు ప్రజలు మీకు జవాబు చెప్తారని హెచ్చరించారు. దమ్ముంటే మోడీని నిలదీయండి, అంతే కానీ నిలదీసే గొంతులపై ఉక్కుపాదం మోపద్దు, ప్రజాస్వామ్యం కోసం పాటుపడే పార్టీగా కాంగ్రెస్ ఇటువంటి దాడులను ఖచ్చితంగా వ్యతిరేకిస్తుందన్నారు వైఎస్‌ షర్మిల.

 

Read more RELATED
Recommended to you

Latest news