తెలంగాణా పోలీసులకు కరోనా చుక్కలు…!

-

తెలంగాణా ప్రజలకే కాదు పోలీసులను కూడా కరోనా కేసులు వెంటాడుతున్నాయి. రోజు రోజుకి పోలీసుల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో ఎంతో కీలకంగా ఉండే పోలీసులు కూడా మహమ్మారి దెబ్బకు విధులకు కూడా రావడం లేదు పాపం. ఈ క్రమంలోనే విధి నిర్వహణలో భాగంగా పలువురు పోలీసులు కరోనా బారిన పడ్డారు అని పోలీసు శాఖ వెల్లడించింది.

పోలీస్ శాఖలో ఇప్పటి వరకు మొత్తం 4,252 మంది పోలీసులకు కరోనా సోకిందని వెల్లడి అయింది. 39 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలోనే కరోనా కేసులు ఎక్కువగా పోలీసు శాఖలో నమోదు అయ్యాయి. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి అని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు విధులకు హాజరు కావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news