తెలంగాణ యూనివర్శిటీలో కరోనా కలకలం.. 21 మంది విద్యార్థులకు పాజిటివ్

-

నిజమాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్శిటీలో కరోనా కలకలం రేపింది. ఇప్పటి వరకు 21 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో హాస్టల్ క్వారంటైన్ లో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు అధికారులు.

ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి భయం తో 200 మందికి పైగా విద్యార్థుల ఇంటి బాట పట్టారు. ఇక దీనిపై ఉన్నత అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎలా కరోనా వ్యాప్తి చెందిందనే దానిపై సుదీర్ఘ విచారణ చేస్తున్నారు. కాగా.. తెలంగాణ రాష్ట్రం లో గత 24 గంటల్లో కొత్తగా 836 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news