ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగం వైపు చూస్తున్నాయి – భట్టి విక్రమార్క

-

ఈ రోజు భారత రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు.. దీనిని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నేడు ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగం వైపు చూస్తున్నాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి ఎలాంటి అలజడి లేకుండా అధికార బదిలీ అయింది అంటే రాజ్యాంగం వల్లేనన్నారు. భారత రాజ్యాంగం సామాజికంగా అందరికి సమాన హక్కులు ఇచ్చిందన్నారు.

20 సూత్రాల అమలు, బ్యాంకుల జాతీయికరణ కాంగ్రెస్ ఆమలు చేసిందన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి మనువాద శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తుందని ఆరోపించారు. 8 సంవత్సరాల బీజేపీ పాలన లో మాములు వ్యాపారవేత్త ప్రపంచంలో నే కుబేరుడుగా మారుతున్నాడని మండిపడ్డారు. ఆర్థిక సమానత్వం లేకుండా ఒక్కరికే కట్టబెడుతున్నారని ఆరోపించారు బట్టి విక్రమార్క. బీజేపీ ప్రభుత్వానికి సమాధానం చెప్పేలా ప్రజలోకి వెళ్ళాలన్నారు.

రాజకీయ సమనత్వం కాంగ్రెస్ అమలు చేస్తూ వచ్చిందని.. ఇప్పుడు బడుగు బలహీన, బహుజన అవకాశాలు కొల్లగొట్టి కొంతమందికె కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ సమానత్వం లో అత్యంత పేదవాడు సైతం ఎన్నికల్లో గెలిచేల ఉండాలన్నారు. దోచుకున్న సొమ్ముతో వేల కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో స్వేచ్ఛ లేకుండా పోయిందన్న అయన.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐ,ఎసిబి లతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news