టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్‌… తెలంగాణ సీఎస్‌ సోమేష్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు!

-

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసారు ఈడీ అధికారులు. తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పై ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని ఫిబ్రవరి 2 న ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు.

నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ కు ఈడీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. హై కోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.

వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. సోమేష్ కుమార్, సర్ఫరాజ్ కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సోమేష్ కుమార్, సర్ఫరాజ్ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు ఈడీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news