సీపీ స్టీఫెన్ రవీంద్ర కీలక ఉత్తర్వులు..9 మంది ఎస్‌ల బదిలీ !

-

 

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 9 మంది ఇన్స్పెక్టర్ ల బదిలీ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. చేవెళ్ల ఇన్స్పెక్టర్ గా ఉన్న వెంకటేశ్వర్లును ఆమన్ గల్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. శంకర్ పల్లి డీఐని చేవెళ్ల ఇన్స్పెక్టర్ గా నియమించారు. సైబర్ క్రైమ్స్‌లో ఉన్న నాగేశ్వర్ రావును ఆల్వాల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా బదిలీ చేశారు.

మొయినాబాద్ ఇన్స్పెక్టర్ గా ఉన్న లక్ష్మిరెడ్డిని షాద్ నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ గా ట్రాన్స్‌ఫర్ చేశారు. అక్కడ ఉన్న సత్యనారాయణను క్రైమ్స్ వింగ్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. షాబాద్ ఇన్స్పెక్టర్ గురువయ్యను క్రైమ్స్ వింగ్‌కు బదిలీ చేశారు. ఇక, సైబర్ క్రైమ్స్‌లో ఉన్న భూపాల్ శ్రీధర్‌ను శంషాబాద్ ఎస్బీకి ట్రాన్స్‌ఫర్ చేశారు. అక్కడ ఉన్న విజయ్ కుమార్‌ను రాజేంద్రనగర్ ఎస్బీకి బదిలీ చేశారు. సీఏటీలో ఉన్న యాదయ్య గౌడ్‌ను షాబాద్ ఇన్స్పెక్టర్ గా నియమించారు.

Read more RELATED
Recommended to you

Latest news