తెలంగాణలో పుంజుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు

-

ఒకప్పుడు సత్తా చాటిన తెలుగుదేశం పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు ఇప్పటినుంచే చర్యలు ప్రారంభించింది. ప్రధానంగా గ్రేటర్‌లో పార్టీకి కేడర్‌ బలంగా ఉండడంతో ఇక్కడి నుంచే అధిక సీట్లను గెలిచేందుకు ప్లాన్‌ వేస్తోంది. పొత్తులపై అధినేత నుంచి క్లారిటీ రాకపోవడంతో అవసరమైతే 119 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని యోచిస్తోంది.

Telangana TDP Can Play A Key Role In Andhra Pradesh Election?

తాజా కార్యాచరణపై టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వివరాలు తెలిపారు. ఈ నెల 23 నుంచి టీటీడీపీ బస్సు యాత్ర చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ బస్సు యాత్రలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా పాల్గొంటారని తెలిపారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం నుంచి యాత్రను ప్రారంభిస్తామని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని కాసాని పేర్కొన్నారు. అనంతరం, జిల్లాల్లో బస్సు యాత్ర చేపడతామని వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news