కాంగ్రెస్ లో కోవర్టులకే గుర్తింపు – దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆయన పార్టీ పరిస్థితులపై మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీలో అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతుందని.. టీ కాంగ్రెస్ కు కోవర్టు అనే ప్రమాదకరమైన జబ్బు వచ్చిందన్నారు.

కొందరు పార్టీలో ఉండి ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని.. టిఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు పార్టీలో కోవర్టులకే గుర్తింపు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం గురించి ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు ఉంటాయని చెప్పారు. అసలు కాంగ్రెస్ లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచన ఉందా.. లేదంటే ఎవరి సొంత ఏజెండా వారికే ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి అన్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో కోవర్టులకే పోస్టులు ఇచ్చారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news