టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన దాసోజు శ్రవణ్..ఎవడబ్బ సొమ్ము అంటూ..

-

టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఎఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. టిఆర్ఎస్ నేతల ఆస్తులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయన్నారు. తెలంగాణ కోసం పోరాడిన పేదవాడు పేదవాడి గానే మిగిలిపోయారని, టిఆర్ఎస్ పార్టీకి ఎకరాకు పైగా భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. వంద కోట్ల విలువైన భూమిని ఎలా టిఆర్ఎస్ పార్టీకి కేటాయిస్తారని మండిపడ్డారు శ్రావణ్. టిఆర్ఎస్ భవన్ కు కూతవేటు దూరంలో మళ్లీ అదే పార్టీకి ఎకరాకు పైగా భూమిని ఎందుకు కేటాయిస్తున్నారని ప్రశ్నించారు.ఇదంతా ఎవడబ్బ సొమ్మని మండిపడ్డారు.

సి ఎస్ సోమేశ్ కుమార్ ప్రభుత్వం సొమ్మును టీఆర్ఎస్ కు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ పోరాటం ఆపదని తెలియజేశారు. అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆ స్థలంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు శ్రవణ్. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ దీనిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. టిఆర్ఎస్ భవన్ స్థలాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందని, అక్కడ టిఆర్ఎస్ ఒక ఛానల్ నడుపుతున్నారని అన్నారు. ఎనిమిది సంవత్సరాల్లో వెయ్యి కోట్లు సంపాదించిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీ అని, టిఆర్ఎస్ పేదల సొమ్మును దోచుకుంటుందని మండిపడ్డారు దాసోజు శ్రవణ్.

Read more RELATED
Recommended to you

Latest news