‘సర్కార్ వారి పాట’ బాగుంది – విజయసాయిరెడ్డి ట్వీట్

-

మహేష్ బాబు తాజాగా పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సుమారుగా రెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా మహేష్ బాబు సినిమా ఈ రోజు విడుదలై.. మంచి టాక్ ను రాబట్టుతోంది.

ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యులు.. విజయ సాయి రెడ్డి సర్కారు వారి పాట మూవీ పై ట్వీట్ చేశారు. “సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం ‘సర్కార్ వారి పాట’ బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు. ” అని చెప్పారు విజయ సాయి రెడ్డి.

కాగా  ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని విలన్ గా బాగా నటించారు. ఇక మహేష్ బాబు స్టైలిష్ లుక్ కూడా ఒక ఫైట్ సీన్ లో ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత యూట్యూబ్ లో ట్రెండీ గా మారిన పెన్ని సాంగ్.. ఆ తర్వాత ట్రైలర్ లో చూపించినట్లుగానే కీర్తి సురేష్ అందంగా కనిపిస్తూ .. తన ఫన్నీ డైలాగ్ లతో ప్రేక్షకులను మెప్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news