50 లక్షల చోరీ.. దొంగల్ని పట్టుకున్న HYD పోలీసులు..!

-

హైదరాబాద్‌ గుడిమల్కాపూర్ పీఎస్ పరిధి లో వారం రోజుల క్రితం దోపిడీ జరిగింది. తిబర్మల్ జ్యువెలర్స్ మేనేజర్ శ్రీకాంత్ నుంచి 50 లక్షల నగదు ఉన్న బ్యాగును చోరీ చేసారు దుండగులు అని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. రేతి బౌలి ఎక్స్ రోడ్‌లోని పిల్లర్ నంబర్ 28 సమీపంలో రాత్రి 11:30 సమయంలో చోరీ చేశారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఐదుగురు దొంగలని అరెస్ట్ చేసాము అని వివరించారు.

హరి ప్రీత్ సింగ్, మంప్రీత్ సింగ్, గుర్జీత్ సింగ్, అబ్బు, శ్రవణ్ ఐదుగురు కలిసి చోరీ చేశారు. ఈరోజు చోరీ చేసిన ఐదుగురు దొంగల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 43 లక్షల 80 వేల నగదు రికవరీ చేశాం. చోరీ చేసిన డబ్బులతో ఐఫోన్లు కొనుగోలు చేశారు. చోరీకి ప్లాన్ వేసిన శ్రవణ్ గతంలో అదే జువెలరీ షాప్ లో పనిచేసే మానివేశాడు. రోజు జువెలరీ షాప్ మూసివేసిన తర్వాత నగదుతో శ్రీకాంత్ ఏ రూట్ లో వెళ్తాడని సమాచారాన్ని నిందితులకు అందించాడు శ్రవణ్. ఇక ఈరోజు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు డీసీపీ సుధీంద్ర పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version