వచ్చే ఎన్నికల్లో KTR సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయం – అరవింద్ ధర్మపురి

-

వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి ఎంపీ అరవింద్ ధర్మపురి. కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ హామీ ఏమైంది ?ఇళ్ళ జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తామన్న హామీ గాలికి వదిలేసారని ఆగ్రహించారు. ఎన్నికల హామీలు తప్ప, ఆచరణలో చేసింది శూన్యమని.. కాలేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు తిన్నారు, కాబట్టే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు.

మీరు డిపిఆర్ ఇస్తే, జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని..మహిళాగవర్నర్ పై అసభ్య పదజాలంతో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూషిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇదేనా బీఆర్ఎస్ సంస్కృతి ? అని నిలదీశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబ సభ్యుల జీవితమే బాగయింది తప్ప, సామాన్య ప్రజల జీవితం దిగజారిందని..చేనేత జీఎస్టీ లో రాష్ట్ర వాటా కట్ చేసి , ఆ తరువాత జీఎస్టీ గురించి మాట్లాడండన్నారు. అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోని పెట్రోల్ , డీజిల్ రేటు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు బిజెపి ఎంపీ అరవింద్ ధర్మపురి.

Read more RELATED
Recommended to you

Latest news