కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రక్రియ నిలిపివేత

-

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన కామారెడ్డి కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్ లతో మాస్టర్ ప్లాన్ ప్రక్రియ పై సమీక్ష నిర్వహించారు అరవింద్ కుమార్.

ఈ సందర్భంగా రైతుల ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను చర్చించారు. ప్రజాభిప్రాయం మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని అరవింద్ కుమార్ తెలిపారు. కామారెడ్డిలో విలీనమైన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. రైతుల భూమి సేకరణ చేసే ఉద్దేశం మాస్టర్ ప్లాన్ తో లేదన్నారు. రైతుల భూములు ఎక్కడికి పోవని సూచించారు అరవింద్ కుమార్. భూములలో కొత్త రోడ్ల నిర్మాణం రైతులకు నష్టం జరగకుండా ఏర్పాటు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news